బూరుగు పెద మల్లయ్య మృతి బాధాకరం : వడ్త్య దేవేందర్ నాయక్

చింతపల్లి అక్టోబర్ 16(జనం సాక్షి)
చింతపల్లి మండలం తీదేడు గ్రామ ఎంపిటిసి నెల్వలపల్లి గ్రామానికి చెందిన బూరుగు ధనమ్మ భర్త బూరుగు పెద మల్లయ్య గుప్త మృతి చాలా బాధాకరమని దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ అన్నారు.సోమవారం ఆయన దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, రైతుబందు అధ్యక్షులు సిరాందాస్ కృష్ణయ్య లతో కలిసి మండలంలోని నెల్వలపల్లిలో మల్లయ్య నివాసం వద్ద మల్లయ్య పార్దివాదేహానికి పూల మాల వేసి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం మల్లయ్య కుమారుడు ప్రణవ గ్రూప్ చైర్మన్ రవికుమార్ ని పరామర్శి మనోదైర్యం నింపారు.వారి వెంట దేవరకొండ రైతుబందు అధ్యక్షులు సిరాందాస్ కృష్ణయ్య, నెల్వలపల్లి గ్రామ సర్పంచ్ గున్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ పోలాగోని శారదా వినోద్ గౌడ్,వార్డు సభ్యులు,తీదేడు గ్రామ 2వ వార్డు మెంబర్ చింతకుంట్ల మమత రాకేష్, సోమలింగం, కుటుంబ సభ్యులు తదితరులున్నారు.