బెల్టుషాపులు ఎత్తివేయాలని ఎక్సైజ్‌శాఖకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపులు ఎత్తివేయాలని ఎక్సైజ్‌ శాఖకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం కార్యాచరణ చేపట్టాలని ఎక్సైజ్‌ శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. నెలరోజుల్లోపు బెల్టుషాపులు ఎత్తివేసి నివేదిక సమర్పించాలని ఎక్సైజ్‌ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.