బైక్ ర్యాలీతో ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలి

జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 18 నవంబర్ 2022
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొత్త రవీందర్ రావు మండల పరిధిలోని గ్రామాల టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మహిళలకు, యువకులకు, ప్రతిపక్షాలు చేసే తప్పుడు ఆరోపణలకు 20 తారీకు ఆదివారం రోజు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఆధ్వర్యంలో చేపట్టబోయే బైక్ ర్యాలీతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,పై చేస్తున్న తప్పుడు ఆరోపణలకు,ప్రతిపక్షాలకు కనువిప్పు కలిగే విధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.