బొంతపల్లిలో జిల్లా స్థాయి భజన మండలి పోటీలు

బొంతపల్లిలో జిల్లా స్థాయి భజన మండలి పోటీలు

చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా సంగారెడ్డి జిల్లా బొంతపల్లి గ్రామంలో గురువారం శ్రీ దుర్గా మారుతీ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి భజన మండలి పోటీలు నిర్వహించగా ఈ పోటీలో 10 భజన మండలి టీంలు పాల్గొన్నడం జరిగింది.ఈ పోటీలో చిలప్ చేడ్ మండలంలోని ఫైజాబాద్ గ్రామ హనుమాన్ భజన మండలికి మొదటి బహుమతి కింద రూ.5000 వేల ఆర్థిక సహాయంతొ షీల్డ్ ను మహోత్సవ కమిటీ ప్రధానం చేసినట్లు హనుమాన్ భజన మండలి సభ్యులు తెలిపారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ భజన కార్యక్రమంలో పాల్గొని మండలి భక్తులతో భజన చేయడం జరిగిందని అన్నారు. ఈ బహుమతి అందుకున్న వారిలో వీరేశం,జనార్దన్,రాములు,అశ్విన్ రెడ్డి,రవి,సుభాష్,కుమార్,దస్తగౌడ్,విట్టల్,యశ్వంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.