భాజపా నేతలతో కమల్‌నాథ్‌ భేటీ

ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీలతో పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమల్‌నాధ్‌ నేడు భేటీ అయ్యారు. చిల్లరవర్తకంలో విదేశీ పెట్టుబడుల విషయమై కేంద్రం చర్చకు అంగీకరించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.