భాజపా పాలనలో దేశం అదోగతి

4

– బీహార్‌లో పట్టినగతే అస్సాంలో పడుతుంది

– రాహుల్‌

అసోం,మార్చి29(జనంసాక్షి):బీజేపీకి బిహార్‌లో పట్టిన గతే అసోంలో కూడా పడుతుందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. బీజేపీ పాలనలో దేశం అదోగతి పాలైందని ఆయన ఆరోపించారు. నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని ఢాంబికాలు పలికిన ప్రధాని మోదీ ఇప్పుడు నల్ల కుభేరులకు ఎర్ర తివాచీ పరుస్తున్నారని ఆయన విమర్శించారు. మంగళవారం అసోంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్‌ పలు బహిరంగ సభల్లో ప్రసంగించారు. నేరుగా ఆయన బీజేపీపై వాక్భాణాలు సంధించారు. బిహార్‌ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించి బీజేపీ భంగపాటుకు గురైందని, ఇప్పుడు అసోంలో కూడా అదే పరిస్థితి ఎదురౌతుందని రాహుల్‌ అన్నారు.బిహార్‌ ప్రజల తలరాత మారుస్తానని లోక్‌సభలో మోదీ చెప్పారని, అది చేస్తాం, ఇది చేస్తామని హావిూలు ఇచ్చారని రాహుల్‌ విమర్శించారు. ఎన్నికల సమయంలో బిహార్‌ వెళ్లిన మోదీ అనేక చోట్ల ఉపన్యాసాలు ఇచ్చారని… బిహార్‌ ప్రజలు మోదీ మాటలు నమ్మలేదని రాహుల్‌ అన్నారు. నెలల క్రితం ఇచ్చిన హావిూలను నిలబెట్టుకోలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మోదీ మాటల మనిషేనని ప్రజలు నిర్ధారించుకున్నారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వంలో రైతులకు ఒరిగేది ఏవిూ లేదని ఆయన విమర్శించారు. అసోంలో కాంగ్రెస్‌ విజయం తథ్యమని, సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాహుల్‌ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.