భారత మార్కెట్లోకి సామ్‌సంగ్‌ జే3(6)


ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్‌ సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. సామ్‌సంగ్‌ గెలాక్సీ జే3(6) పేరున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో గతేడాదే విడుదల చేశారు. దీని ధర రూ.8,990గా కంపెనీ ప్రకటించింది. ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ స్నాప్‌డీల్‌లో ఇవాళ్టి నుంచి వినియోగదారులకు లభ్యం కానుంది.

ఫోన్‌ ఫీచర్లు ఇవి..
* 5 అంగుళాల తాకే తెర
* 1.5 గిగాహెడ్జ్‌ ప్రొసెసర్‌
* 1.5 జీబీ ర్యామ్‌
* 8జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌(ఎక్స్‌పాండ్‌ 128జీబీ)* 5.1 ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌
* 8 మెగాపిక్సల్‌ ఆటోఫోకస్‌ రేర్‌ కెమెరా
* 5 మెగాపిక్సల్‌ ముందు కెమెరా
* 4జీ సదుపాయం
* 2600ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
* డ్యూయల్‌ సిమ్‌