భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో బీహెచ్ఈఎల్ సంస్థ షేర్లు అత్యధికంగా 3.74శాతం లాభపడి రూ.141.50 వద్ద ముగిశాయి. వీటితోపాటు టాటా స్టీల్, అల్ట్రా టెక్ సిమెంట్, హెచ్సీఎల్ టెక్, విప్రో సంస్థల షేర్లు సైతం లాభాలతో ముగిశాయి.
అలాగే కెయిర్న్ ఇండియా సంస్థ షేర్లు అత్యధికంగా 7.57శాతం నష్టపోయి రూ.110.55 వద్ద ముగిశాయి. వీటితోపాటు వేదాంత లిమిటెడ్, రిలయన్స్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్ సంస్థల షేర్లు సైతం నష్టాలతో ముగిశాయి.