భువనగిరి ఆశీర్వాద సభలో అపశృతి..

భువనగిరి టౌన్ జనం సాక్షి

ప్రజా ఆశీర్వాద సభలో అపశృతి చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. హాజరైన కార్యకర్త హఠాత్తుగా సభా స్థలం కు రాగానే సౌండ్ సిస్టం తో వచ్చిన శబ్దం కారణంగా సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడే ఉన్న కొందరు కార్యకర్తలు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటు కారణమై ఉండవచ్చని వైద్యులు తెలిపారు. మృతుడు పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన సత్తయ్య గా గుర్తింపు…