భూమి అమ్మ వద్దన్న భార్యను నరికి చంపిన కసాయి భర్త
కడప,నవంబర్9(జనం సాక్షి) : మామిడి తోటను అమ్మొద్దు.. అని చెప్పిన భార్యను కసాయి భర్త నరికి చంపిన దారుణ ఘటన శనివారం వెలుగు చూసింది. రాయచోటి పట్టణంలోని కొత్తపేట చైతన్య స్కూల్ సవిూపంలో శుక్రవారం రాత్రి 12.20 గంటల సమయంలో ఖాదర్ వలి (46) అనే వ్యక్తి తన భార్య నూర్జహాన్ ను అతి దారుణంగా కొడవలి తో తల పైన నరికి చంపి, ఆ తరువాత అడ్డుకోబోయిన కొడుకు మహమ్మద్ రఫీ ని కూడా చంపేందుకు ప్రయత్నించాడు. కొడుకు కు కూడా స్వల్ప గాయమైంది. లక్కిరెడ్డిపల్లి మండలం మద్దిరేవుల రెడ్డివారిపల్లి గ్రామంలో ఉన్న మామిడి తోటను అమ్మొద్దు అని భార్య, కొడుకు ఇద్దరూ చెప్పినందుకు ఖాదర్వలి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అర్బన్ సిఐ రాజు తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకొని జరిగిన సంఘటన పై ఆరా తీసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.