మండల కమిటీ ఎన్నుకున్న లక్నవరం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్.

ములుగు జిల్లా
గోవిందరావుపేట ఆగస్టు 17(జనం సాక్షి):-

బుధవారం గోవిందరావుపేట మండలం లక్నవరం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జింకల పార్కు వద్ద మండల కమిటీ ఎన్నుకోవడం కోసం లక్ష్మీ ఫోటో స్టూడియో దేవేందర్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది.ఎలక్షన్ ఆఫీసర్గా డివిజన్ అధ్యక్షులు నర్రా రఘువీర్ భూపతి రామకృష్ణ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా లక్నవరం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మచ్చ వెంకటేశ్వర్లు రేవతి ఫోటో స్టూడియో ఉపాధ్యక్షుడిగా అంబాల మురళి ప్రధాన కార్యదర్శి మేడిపల్లి సురక్షిత్ కుమార్ చిన్ని ఫోటో స్టూడియో కోశాధికారిగా పెండం ప్రవీణ్ నవ్య ఫోటో స్టూడియో ప్రచార కార్యదర్షు లు గా రేండ్ల రాజు భార్గవ్ ఆర్కె స్టూడియో మరియు పగడాల శ్రీకాంత్ మరియు కార్యవర్గ సభ్యులు గా  బొనగాని రాము,రమేష్,పరుశురాం,పూర్ణ చందర్,రవి కిషోర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.వీరు అసోసియేషన్ కోసం ఆహార్నిశలు కష్టపడి అభివృద్ధి కోసం పాటుపడుదామని తెలియజేస్తున్నారు.మరియు ఆగస్ట్ 19 న జరిగే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం అన్ని మండలాల ఫోటోగ్రాఫర్లు విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు.