మంత్రిగారి మరదలు…! అడ్డంగా బుక్కయ్యారు..

kasyap

బావ మంత్రి.. అందునా విద్యాశాఖ మంత్రి.. పైగా తాను పరీక్ష రాస్తున్నది తన అక్క కోసమే. ఇక అడిగే వారు ఎవరనుకుని దర్జాగా రాసేస్తోంది. అయితే కథ అడ్డం తిరిగింది. పక్కనున్న విద్యార్థులు గొడవ మొదలు పెట్టారు. బావామరదళ్ళు, అక్కచెల్లెళ్ల భాగోతం బయట పడింది. ఎక్కడా..? ఎందుకు? వివరాలిలా ఉన్నాయి. 

ఛత్తీస్‌గఢ్‌ విద్యా మంత్రి కేదార్‌ కాశ్యప్‌ భార్య శాంతి కాశ్యప్‌ కోసం స్వయంగా మంత్రిగారి మరదలు కిరణ్‌ మౌర్య ఇంగ్లిషు పరీక్ష రాస్తూ అడ్డంగా దొరికిపోయారు. శాంతి జగదల్‌పూర్‌లోని సుందర్‌లాల్‌ శర్మ ఓపెన్‌ వర్సిటీలో ఎంఏ ఇంగ్లిషు రెండో సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు. 
పక్కనే ఉన్న ఇతర విద్యార్థులు ఆమెను చూసి, ఒకరి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లుగా గ్రహించి… గొడవ చేయడంతో అసలు విషయం బట్టబయలైంది.