మంత్రి నిరంజన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరిక

వనపర్తి బ్యూరో అక్టోబర్ 28 (జనంసాక్షి)

జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ఆధ్వర్యంలో జగత్ పల్లి గ్రామానికి చెందిన తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి , ఫార్మల్ నేషనల్ బాక్సర్ ఏ.ప్రతాప్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో శనివారం జిల్లా కేంద్రం లోని మంత్రి నివాస గృహంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్ , మీడియా సెల్ ఇంఛార్జి నందిమల్ల అశోక్, నాయకులు బీచుపల్లి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.