మంథని మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్

జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మాతా శిశు ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో ఆయన ఆసుపత్రిలో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవలను పై ఆరా తీశారు. మాతా శిశు, సామాజిక వైద్యశాలలో మెరుగైన సౌకర్యాల కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రిలో సూపర్డెంట్ శ్రీధర్, కోఆర్డినేటర్ వాసుదేవరెడ్డి, మంథని ఆసుపత్రి సూపండెంట్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.