మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా పాలక వర్గ సభ్యుల ఎన్నికల నోటిఫికేషన్.

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో, జనంసాక్షి:

నాగర్ కర్నూల్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జిల్లా పాలక వర్గం సభ్యుల ఎన్నికల నోటిఫికేషన్ ను శుక్రవారం జిల్లా కేంద్రంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పాత కార్యాలయంలో ఎన్నికల అధికారి రఘునాథ రావు విడుదల చేశారు.నామినేషన్ల స్వీకరణ ఈ నెల 17న ఉదయం 8 నుండి మద్యహ్నం1 వరకు, నామినేషన్ల పరిశీలన నామినేషన్ల స్వీకరణ అనంతరం,నామినేషన్ల ఉపసంహరణ మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు, 21న ఎన్నికలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు, అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.నాగర్ కర్నూల్ నియోజకవర్గం, కల్వకుర్తి నియోజకవర్గం ,అచ్చంపేట నియోజకవర్గం,కొల్లాపూర్ నియోజకవర్గాల్లో 223 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు జిల్లా కమిటీ లో భాగంగా జిల్లా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు , కార్యదర్శి , డైరెక్టర్ లు 11 మంది కీ ఎన్నిక ఉంటుందని తెలిపారు. 223 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులకు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత, మరియు ఓటు వేసే అర్హత ఉంటుంది తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్, జిల్లా చీఫ్ ప్రమోటర్ వాకిటి ఆంజనేయులు, ప్రమోటర్ లు అల్లోజీ, సహదేవుడు, పెబ్బేటి నిరంజన్, ఈశ్వర్, శాంతమ్మ , హరికృష్ణ ముదిరాజ్, తవిటి నిరంజన్, తాడుర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్,బంగారయ్య, యానమోని తిరుపతయ్య, చాపల స్వామి,చెన్న కేశవులు, రమేష్, నిరంజన్, బాలస్వామి, రామకృష్ణ, జగన్, శివ,వెంకటయ్య, లక్ష్మయ్య,ఉషేందర్, నిరంజన్,పాపగల్ వెంకటయ్య, కృష్ణయ్య , మహేష్, అంజి,రాము తదితరులు పాల్గొన్నారు.