మధ్యప్రదేశ్ రైలు ప్రమాదాలతో పలు రైళ్లు నిలిపివేత
మధ్యప్రదేశ్, ఆగస్టు 5 : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాల కారణంగా పలు రైళ్లను నిలిపివేశారు. ముంబయి, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ర్టాల నుంచి వచ్చే రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లను రాజస్థాన్-కోట మీదుగా మళ్లించారు. హర్దా వద్ద మూడు రైళ్లను రద్దు చేశారు. 25 రైళ్లను దారిమళ్లించారు. మధ్యప్రదేశ్లో జరిగిన రెండు వేర్వేరు రైలు ప్రమాదాల్లో ఎంత మంది మరణించారనేది ఇంకా తేలలేదు. పట్టాలు తప్పిన బోగీల్లోకి వరద నీరు చేరిందని రైల్వే అధికారులు చెప్పారు. రైల్వేఅధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు