మనవడి ఆధ్వర్యంలో మర్రి చెన్నారెడ్డి పేర ఫౌండేషన్‌

హైదరాబాద్‌:మాజీ ముఖ్యమంత్రి దివంగత మర్రిచెన్నారెడ్డి పేరిట ఆయన మనవడు అదత్యరెడ్డి త్వరలో ఒక ఫౌండేషన్‌ ప్రారంబించనున్నారు.దీనికి సంబందించిన లోగోను ఈరోజు ఆవిషరించారు.ఈ ఫౌండేషన్‌ ప్రజలకు,ప్రభుత్వానికి మద్య వారదిగా ఉంటుందని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుందని సనత్‌నగర్‌ ఎమ్మేల్యే శశిదర్‌ రెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డి తెలిపారు.ప్రజలకు స్వచ్చంద సేవలందించడంతో పాటు జిల్లాలో పర్యటించి అక్కడి సమస్యల్ని తెలుసుకుంటామన్నారు.