మరుపురాని మహానేత వైఎస్ఆర్

రుద్రంగి సెప్టెంబర్ 2 (జనం సాక్షి)
రుద్రంగి మండలం మానాల గ్రామంలో వైయస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా నాలుగు పర్యాయలు పార్లమెంట్ సభ్యుడిగా మూడు పర్యాయాలు సిఎల్పీ నేతగా రెండు పర్యాయాలు పిసిసి అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఓటమి ఎరుగని ప్రజానాయకుడు వైయస్సార్ అన్నారు. ఆ రూపం ప్రజల గుండెల్లో చెరగని జ్ఞాపకం అని ఆ నడక తెలుగు ప్రజలకు కొండంత అండ అని ఆ చిరునవ్వు కోట్ల గుండెలకు భరోసా కల్పించిందని ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత వైఎస్ఆర్ ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ జక్కు వంశీ,రాజన్న సిరిసిల్ల జిల్లా సహా కార్యదర్శి తుమ్ జలపతి,సీనియర్ నాయకులు జక్కు మోహన్, లక్కాకుల రమేష్, బుర్ర శంకర్,కొమ్ముల రవీందర్ రెడ్డి,జక్కు లింగారెడ్డి,గోలి రవి,నవీన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.