మరో 30ఏళ్లు జగనే సీఎం 

– ఏపీలో త్వరలోనే టీడీపీ ఖాళీ ఖాయం
– వైసీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య
అమరావతి, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   వందరోజుల సీఎం జగన్‌ పాలన అద్భుతంగా ఉందని, మరో 30యేళ్లు జగనే సీఎం అని,అ ందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారి వైసీపీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ, జనసేన,
బీజేపీ పొత్తు గురించి అయ్యన్న పాత్రుడితో మాట్లాడించింది చంద్రబాబు నాయుడే అంటూ ఆరోపించారు. మరో 30 ఏళ్లు వైసీపీనే అధికారంలో ఉంటుందని బాబుకు అర్థమయ్యిందని, అందుకే అయ్యన్న పాత్రుడి ద్వారా టీడీపీ.. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తుందని చెప్పించారన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యిందపని, అలానే ఏపీలో కూడా త్వరలోనే టీడీపీ ఖాళీ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి 100 రోజుల పాలనలో చంద్రబాబు వంద అబద్దాలు.. 101 కుట్రలు చేశారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగిన మాట వాస్తవమే ఐతే.. నిజంగానే 8మందిని  హత్య చేస్తే.. ఎందుకు విూడియాలో రాలేదని ప్రశ్నించారు. ఎందుకు పోలీస్‌ రికార్డుల్లోకి ఎక్కలేదని ఆయన ప్రశ్నించారు. గ్రామాల్లో జరిగే చిన్నచిన్న గొడవలను తన రాజకీయ ప్రయోజనాల కోసం బాబు పెద్దవిగా చూపుతూ రాద్దాంతం చేస్తున్నారని రామచంద్రయ్య మండి పడ్డారు. పార్టీ కార్యక్రమాలకు ఎవరూ రాకపోవడంతో చంద్రబాబు డబ్బులిచ్చి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. పెయిడ్‌ ఆర్టిస్ట్‌లను తీసుకొచ్చి జగన్‌ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పాలనలో ప్రభుత్వ అధికారుల విూద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దాడి చేస్తే బాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కోడెల అరాచకాలపై సిట్‌ ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే.. చంద్రబాబు ఎందుకు మాట్లాడలేక పోతున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఆంబోతుల్లా తయారై రాష్టాన్న్రి దోచుకున్నారని మండి పడ్డారు. చంద్రబాబుకు నచ్చిన 10 గ్రామాలను ఎంచుకుని.. జన్మభూమి కమిటీల వలన జరిగిన అన్యాయాలపై.. జగన్‌ ప్రభుత్వం వలన జరిగిన మేలుపై చర్చ పెడదాం. అందుకు బాబు సిద్ధమేనా అని రామచంద్రయ్య ప్రశ్నించారు.