మళ్లీ భూసేరణ ఆర్డినెన్స్‌ తీసుకురాం

5

– ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ,ఆగస్టు 30, (జనంసాక్షి) :ఇక భూ సేకరణ చట్టం సవరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్‌ ప్రస్తుతం తీసుకురాబోమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. భూసేకరణ

చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌ కాలపరిమితి సోమవారం పూర్తవనున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ ప్రకటన పలు వర్గాల్లో ఆసక్తిని రేపింది. ఇదే అదనుగా చూసుకుని ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవడానికి తమ పోరాటమే కారణమని కాంగ్రెస్‌ పార్టీ సోనియాగాంధీ అన్నారు.    ఆర్డినెన్స్‌ తీసుకురాబోమని చెప్పిన ప్రధాని ప్రస్తుతం ఈ బిల్లు

రాజ్యసభలో పెండింగ్‌లో

ఉన్నందున బిల్లులో రైతుల ప్రయోజనాలుద్దేశించి ఎలాంటి సవరణలు కోరుకుంటున్నారో, ఏ అంశాలు చేర్చాలని భావిస్తున్నారో సలహాలు ఇస్తే స్వీకరిస్తామని స్పష్టం చేశారు. 2013లో తీసుకొచ్చిన భూ సేకరణ చట్ట సవరణ బిల్లు రైతుల్లో తీవ్ర ఆందోళన పుట్టించిన విషయం తెలిసిందే.    గ్రావిూణ ప్రాంతాల్లోని రైతులకు దీనివల్ల చాలా మేలు జరుగుతుందని చెప్పిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తర్వాత యూ టర్న్‌ తీసుకొని బిల్లులో సవరణలకు డిమాండ్‌ చేశాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇందుకు అనుమతించకపోవడంతో గత రెండు పార్లమెంటు సమావేశాలు ఈ అంశం కారణంగానే ఎలాంటి చర్చ లేకుండా ముగిశాయి. ఇప్పటి వరకు ఈ చట్టానికి సంబంధించి మూడు సార్లు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు.గుజరాత్‌ లో ఇటీవల పటీదార్‌ (పటేల్‌) కులస్తులు నిర్వహించిన ఆందోళనల్లో హింస చోటుచేసుకున్న నేపథ్యంలో శాంతి యుతంగా ఉండాలంటూ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. మరోసారి అదే అంశంపై తన మనసులోని మాటలను వెల్లడించారు. ప్రతినెల చివరి ఆదివారం ఆలిండియా రేడియో ఢిల్లీ కేంద్రంలో నిర్వహించే మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాజాగా గుజరాత్‌లో చెలరేగిన హింస యావత్‌ భారతావనిని బాధించిందన్నారు.

ఇటీవల గుజరాత్‌ రాష్ట్రంలో చోటుచేసుకున్న హింస దేశం మొత్తాన్ని బాధించింది. అయితే విజ్ఞులైన గుజరాతీలు తక్షణమే స్పందించడం వల్ల పరిస్థితి తిరిగి అదుపులోకి వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ నడయాడిన నేలలో ఇలా హింస జరగడం అత్యంత బాధాకారం. అల్లర్లు సర్దుమణిగిన తర్వాత గుజరాత్‌లో శాంతి వెల్లివిరిసిందిడచ39; అని

మోదీ అన్నారు.    తమను ఓబీసీ జాబితాలో చేర్చాలని పటేల్‌ కులస్తులు నిర్వహించిన ఆందోళనల్లో తొమ్మిది మంది మృతి చెందగా, వందల మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన దాదాపు 200 వాహనాలు అగ్నికి ఆహుతి అయిన విషయం తెలిసిందే.