మహబూబ్‌నగర్‌ జిల్లాలో విజృంభించిన చికెన్‌గున్యా

ఉట్కూరు, జనంసాక్షి: మహబూబ్‌నగర్‌ జిల్లా ఉట్కూరు మండలం పెద్దపొర్లలో చికెన్‌గున్యా విజృంభించింది. దీంతో పలువురు గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యాధికారులు గ్రామంలో వైద్యాశిబిరం ఏర్పాటు చేసి గ్రామస్థులకు చికిత్స అందిస్తున్నారు.