మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం…మంటల్లో చిక్కుకున్న పలువురు

63ముంబై : మహారాష్ట్రలోని భీవండిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక వస్త్రపరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. నాలుగు అంతస్థుల భవనానికి మంటలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని 12 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 80 మంది చిక్కుకున్నారు. కొందరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.