మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం చేసిన సైప సురేష్

గంగారం ఆగస్టు 28 (జనం సాక్షి)

గంగారం మండలం కోమట్లగూడెం గ్రామంలో ఉన్నటువంటి కోదండ రామాలయం కమిటీ చైర్మన్ సైప సురేష్ శనివారం రోజు కొత్తగూడ మండలం దుర్గారం గ్రామంలో అగ్ని ప్రమాదంతో దబ్బెట రమేష్ ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది ఇట్టి విషయం తెలుసుకున్న సైప సురేష్ రోటరీ క్లబ్ నర్సంపేట సెక్రెటరీ బాదం రంజిత్ తొ కలిసి వెంటనే దుర్గారం గ్రామానికి చేరుకొని ఆ కుటుంబ సభ్యులందరికీ మనో ధైర్యాన్ని నింపారు తమ వంతు ఆర్థిక సహాయంగా పదివేల రూపాయలను వారికి ఇవ్వడం జరిగింది, సైప సురేష్  మానవతా దృక్పథంతో చేస్తున్న ఆర్థిక సాయం స్థానికంగా ఉన్న మేధావులు కొనియాడారు ఈ కార్యక్రమంలో మాలే రాజేష్, గండు నవీన్ మరియు శ్రీరామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు