మానవత్వమే నా మతం.. మాట నిలుపుకోవటమే నా కులం

 

– ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ‘ఆరోగ్య ఆసరా ఫథకం’

– ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

– మే నాటికి వైద్యులు, నర్సుల పోస్టులు భర్తీచేస్తాం

– క్యాన్సర్‌ రోగులకు పూర్తిస్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలు

– జనవరి 1 నుంచి కియోథెరపీ వైద్యాన్ని ఉచితంగా అందిస్తాం

– ఏపీ సీఎం వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి

– వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ఆసరా ప్రారంభించిన సీఎం

గుంటూరు, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : మానవత్వమే నా మతం.. మాట నిలుపుకోవటమే నా కులం అని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్‌ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఆయన సోమవారం గుంటూరు జనరల్‌ ఆస్పత్రిలో ప్రారంభించారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు 225 రుపాయలు లేదా నెలకు గరిష్టంగా 5వేల రూపాయలను ఈ పథకం ద్వారా అందజేస్తారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన రోగులు ముఖ్యమంత్రి చేతులు విూదుగా చెక్కులు అందుకున్నారు. అనంతరం గుంటూరు మెడికల్‌ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో జరిగిన సభలో జగన్‌ మాట్లాడుతూ..

ప్రతీ పక్షాలు పదేపదే నా మతం గురించి విమర్శలు చేస్తున్నారనీ, మానవత్వమే నా మతం..మాట నిలుపుకోవటమే నా కులం అని అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో ‘ఆరోగ్య ఆసరా’పథకాన్ని ప్రారంభించామన్నారు. 1060 అంబులెన్స్‌ లను కొనుగోలు చేసి ప్రజల సేవల కోసం వినియోగిస్తామని హావిూ ఇచ్చారు. 1060 అబులెన్స్‌ లను కొనుగోలు చేసి 2020 ఏప్రిల్‌ నాటికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. 104,108 నంబర్లకు ఫోన్‌ చేస్తే10 నిమిషాల్లోనే అంబులెన్స్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అంబులెన్స్‌ లో పేషెంట్లను తీసుకొచ్చి మంచి హాస్పిటల్‌ లో చేర్పించి..ఉచితంగా వైద్య సేవల్ని అందించి పూర్తి ఆరోగ్యంగా చిరునవ్వుతో తిరిగి వారి ఇళ్లకు వెళ్లేలా చేస్తామన్నారు. ఆరోగ్య ఆసరా పథకం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తామని, అనారోగ్యానికి గురైన ఎవ్వరూ బాధపడాల్సిన పనిలేదని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు. చికిత్స ద్వారా కోలుకునే సమయంలో కూడా బాధితులకు ఆర్థిక సహాయం అందేలా నెలకు రూ.5వేలు..లేదా రోజుకు రూ.225 అందజేస్తామన్నారు. దీనికి సంబంధించిన చెక్కును స్వయంగా పేషెంట్‌ చేతికే అందిస్తామన్నారు. ఈ సేవలన్నీ 2020 ఏప్రిల్‌ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం జగన్‌ ప్రజలకు ఆరోగ్య హావిూని ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రజలు ఉచితంగా కంటి పరీక్షలు చేసేలా ఆక్టోబర్‌ 10 ప్రారంభించామని సీఎం తెలిపారు. 66 లక్షల మంది స్కూల్‌ పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించమనీ..ఈ పథకాన్ని అన్ని వర్గాలకు విస్తరిస్తామనీ త్వరలోనే మరో ఆరు నెలల్లో వృద్ధులకు కూడా ఈ పథకం ద్వారా ఉచిత కంటిపరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలా ఈ పథకాన్ని అందరికీ వర్తించేలా చేస్తామన్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో పెను మార్పులు తీసుకొస్తూ.. నవంబర్‌ 1 నుంచి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ లో ఆరోగ్య శ్రీ పథకం

ద్వారా ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పటానికి గర్వంగా ఉందన్నారు. డిసెంబర్‌ 15 నాటికి ప్రతీ గవర్నమెంట్‌ హాస్పిటల్‌ లోను..510 రకాల మందులను అందుబాటులో ఉండేలా చేస్తామని, దానికి సంబంధించిన చర్యల్ని తీసుకుంటున్నామని జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. మే నాటికి ఖాళీగా ఉన్న డాక్టర్‌, నర్సుల పోస్టులను భర్తీ చేస్తామని సీఎం హావిూ ఇచ్చారు. మూగ, చెవిటి పిల్లలకు ఉచితంగా కాక్లియర్‌ ఎ/-లాంట్స్‌ అమరుస్తామన్నారు. క్యాన్సర్‌ రోగులకు పూర్తిస్థాయిలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తామన్నారు. జనవరి 1 నుంచి క్యాన్సర్‌ రోగులకు కీమోథెరపీ వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని సీఎం వెల్లడించారు.