మావోయిస్టు నేత చంద్రన్న భార్యకు 14 రోజుల రిమాండ్‌

ఖమ్మం : నిన్న అరెస్టు చేసిన మావోయిస్టు అగ్రనేత చంద్రన్న భార్య రాధ, వృధ్వీ రాజ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. సోమవారం వీరు ఛత్తీస్‌గఢ్‌ నుంచి హైదరాబాద్‌కు వాహనంలో వెళ్తూ ఖమ్మం జిల్లాలో పోలీసులకు చిక్కారు.