ముంబయిలో వంతెన కూలి ముగ్గురు మృతి

ముంబై, ఫిబ్రవరి7(జనంసాక్షి): ముంబైలో నిర్మాణంలో ఓ వంతెన కూలి ముగ్గురు దుర్మరణం చెందారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న వంతెనలోని కొంత భాగం బుధవారం అర్ధరాత్రి కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాలు విూదపడడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కూలిన వంతెన కింద పలువురు కూలీలు చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి పలువురిని వెలికితీశారు. తీవ్రంగా గాయపడ్డ వారిని వారిని కూపర్‌ ఆస్పత్రి, దేశాయ్‌ హాస్పిటల్‌లకు తరలించారు. మరికొంత శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మృతి చెందిన వారు, గాయపడ్డ వారంతా కూలీలేనని అధికారులు తెలిపారు. నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంపై విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం కారణంగానే వంతెన కూలిందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఇప్పటికే ఎల్‌ అండ్‌ టీ సంస్థపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు ఉద్యోగులను అరెస్టు చేశారు.