ముంబయి దాడులు మృతులకు పార్లమెంట్‌ నివాళి

న్యూఢిల్లీ: ముంబయి నగరంపై ఉగ్రవాదుల దాడులు జరిగి నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో మృతులకు పార్లమెంట్‌ ఉభయసభలు ఘన నివాళి అర్పించాయి. ఈ ఉదయం సమావేశాలు  ప్రారంభం కాగానే సభ్యులు ముంబయి దాడులో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు.