ముంబై హైకోర్టులో మ్యాగీకి ఊరట 6వారాల పాటు నిషేధం ఎత్తివేత
ముంబై, ఆగస్టు 13 : దేశవ్యాప్తంగా నిషేదం కొనసాగుతున్న మ్యాగీకి ముంబై హైకోర్టులో ఊరట లభించింది. మ్యాగీపై ఆరువారాల పాటు నిషేధం ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మ్యాగీపై మరోసారి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. జైపూర్, మొహాలీ, హైదరాబాద్లో పరీక్షలు చేయాలని కోర్టు సూచించింది.
ఆరు వారాల్లోగా పరిక్షా పలితాలు వెల్లడించాలని ఉత్వర్వుల్లో పేర్కొంది. పరీక్షా ఫలితాలు అనుకూలంగా వస్తేనే మ్యాగీ అమ్మకాలు తిరిగి కొనసాగించాలని ముంబై హైకోర్టు ఆదేశించింది