ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి ఫీల్డ్ అసిస్టెంట్లు రుణపడి ఉండాలి*

పోల్కంపల్లి ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-ఉపాధి హామీ పతకం లో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి వీధుల్లో కి తీసుకోవడం చాలా గర్వకారణమని పోల్కంపల్లి ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్ల మళ్ళీ విధుల్లోకి తీసుకున్న పోల్కంపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ బాల రాజ్ కి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఎంపీటీసీ మంగ రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయన్నారు.ఫీల్డ్ అసిస్టెంట్లకు మొన్నటి వరకు పనులు లేక పస్తులుండే సమయం లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదన్నారు. వారి కుటుంబాలను కాపాడిన మహానుభావుడు కేసీఆర్ అన్నారు.  టి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ప్రభుత్వమన్నారు.కార్మిక,కర్షకులకు, వ్యవసాయ కూలీలకు అండగా నిలుస్తుందన్నారు.ప్రభుత్వం చేసిన మేలు ఫీల్డ్ అసిస్టెంట్లు మరువొద్దన్నారు