ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం..

) జనం సాక్షి :
ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు తెరాస జిల్లా అధ్యక్షులు జగదీష్ చొరవతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఈరోజు  మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామానికి చెందిన జె. రాజయ్య 60 వేల రూపాయలు అక్షరా అరవై వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారునికి  టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి వెంకటాపూర్ ఎంపీపీ  బుర్ర రజిత సమ్మయ్యతో కలిసి లబ్ధిదారునికి అందజేశారు ..
అనంతరం మండల అధ్యక్షులు మాట్లాడుతూ సహాయ నిధి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వర౦గా ప్రాధాన్యతగా ఉందన్నారు అన్ని వర్గాలకు ప్రజలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతుందని అన్నారు ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం పొంది ఆర్థికంగా అప్పుల పాలైన వారిని ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పేదల అవసరాలకు ఉపయోగపడుతుందని అన్నారు…
ఈ కార్యక్రమంలో  సర్పంచ్ గట్టు కుమారస్వామి పిఎసిఎస్ చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ ఎర్రబెల్లి గోపాలరావు మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ తండా రమేష్ రైతుబంధు సమితి గ్రామ కమిటీ అధ్యక్షులు వీరగాని సాంబయ్య వెంకటాపూర్ మాజీ సర్పంచ్ సాదా యాదగిరి ములుగు జిల్లా జాగృతి నాయకులు అంతటి రాము ముడిగా రాజ్ కుమార్ గట్టు శ్రీనివాస్ బూర్గుపేట ఎంపీటీసీ మధుకర్ వెంగళ రమేష్ అంతటి రాజు అజ్మీర్ సదర్ లాల్ రెడ్డి మహేందర్ సదయ్య తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు