మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి : యేకుల సురేష్ (కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు)

యేకుల సురేష్ ఉప సర్పంచ్ & కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ఇలా అన్నారు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన ప్రజలను అందుకునే విధంగా లేవని ఎన్నో వాగ్దానాలు చేసి నేటికి నెరవేర్చకుండా ఉన్నాయని అన్నారు. టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నాయని అన్నారు.
కేంద్రంలొని బీజేపీ ప్రభుత్వం జూలై నుండి నేటి వరకు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయలేదని అదే బాటలో రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయడం లేదు అలాంటప్పుడు గ్రామాల అభివృద్ధి ఏవిధంగా సాగుతోందని విమర్శించారు.
ఎన్నో ప్రగల్భాలు పలికే బిజెపి టిఆర్ఎస్ నాయకులు మునుగోడు నియోజకవర్గంలోని గ్రామగ్రామాన తిరిగి ఓటర్లను ప్రలోభ గురిచేశారన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ విషయాలు గమనించి ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని కావున ఈ ఎన్నిక లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి రెండు పార్టీలను ఓడించాలని అన్నారు.