మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన గుమ్మడవల్లి సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్

కొండమల్లేపల్లి నవంబర్ 7 (జనం సాక్షి) న్యూస్ : గుమ్మడపల్లి గ్రామంలో సోమవారం నాడు సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల సంతోషం ఆనందం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మునుగోడు ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి ఘనవిజయం సాధించిందని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రజలను గౌరవంతో జీవనం కొనసాగించాలని ప్రజలకు అవసరమయ్యే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు ముఖ్యంగా యాదవ సోదరులకు గొర్రెల యూనిట్లు, సబ్సిడీలు, వడ్డీ లేని రుణాలు అందించారని తెలిపారు గ్రామాలలో అభివృద్ధికి పెద్దపీట వేశారని అన్ని వర్గాలు అభివృద్ధి చెందేలా టిఆర్ఎస్ ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తుందని తెలిపారు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఆసరా పెన్షన్లు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి రైతుబంధు రైతు బీమా లాంటి ఎన్నో సంచలనాత్మక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని హర్షం వ్యక్తం చేశారు ప్రజా సంక్షేమ పథకాలే మునుగోడు ఉప ఎన్నికలలో విజయం సాధించింది అని తెలిపారు మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ విజయం కోసం శ్రమించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మిత్రులకు అభినందనలు తెలిపారు రాబోయే రోజుల్లో మునుగోడు ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మునుగోడు ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు