మునుగోడు లో నందిపేట్ మండల బిజెపి నాయకులు ప్రచారం .

నందిపేట్ ( జనం సాక్షి ) అక్టోబర్ 31. మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం గ్రామంలో 6 ,7 బూతులలో గడపగడపకు తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించమని కోరడం జరిగినది ఇట్టి కార్యక్రమములు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్, నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు శ్రీ నరేందర్ .ఆ గ్రామ ఆరు, ఏడు బూతులలో గల బూత్ కమిటీ సభ్యులు మరియు అధ్యక్షులు పాల్గొనడం జరిగినది.