*మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 15,
జనంసాక్షి
మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని పురపాలక సంఘ కార్యాలయం ఆవరణలో అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా , ముఖ్య అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు , మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య పాల్గొనడం జరిగింది. అలాగే బాల బాలికల ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు మరియు మెట్పల్లి స్లం.. ఏరియా ఆరో వార్డులోని ప్రజలకు అంతర్జాతీయ చేతుల పరిశుభ్ర దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ,ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య మాట్లాడుతూ
విద్యార్థిని విద్యార్థులు భోజనం చేసే సమయానికి ముందు చేతులు సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కోవాలని, అలాగే ఎప్పుడైనా మరుగుదొడ్లకు వెళ్ళినప్పుడు శుభ్రముగా చేతులు కడుక్కోవాలని దీని ద్వారా చేతులకు ఏమైనా క్రిమి కీటకాలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారని, ఉండాలని ఇటువంటి కార్యక్రమాన్ని మెట్పల్లి మున్సిపల్ కార్యాలయం ద్వారా సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నామని అన్నారు,
వార్డ్ ఆఫీసర్స్ ,ఆఫీస్ స్టాప్ ఆర్ పీస్ లకు అలాగే విద్యార్థిని విద్యార్థులకు అలాగే పట్టణ వార్డు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించి హ్యాండ్ వాష్ చేయించడం అయినది .
ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖర రావు ,మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య మున్సిపల్ స్టాప్ తదితరులు పాల్గొన్నారు