మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

గురువారం కొల్లాపూర్ మున్సిపాలిటీ ఆవరణంలో ఈనెల 18 19 తేదీల్లో జరుగు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు అనుమకొండలో జరుగుతున్నాయి. ఆ మహాసభలను జయప్రదం చేయాలని గోడపత్రికలను కార్మికులతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు 21000 ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది కానీ నేటికీ అమలు చేయడం లేదన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నాలుగు గ్రామాలు విలీనమైన కార్మికుల సంఖ్య పెంచలేదని అన్నారు. ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రకారం కార్మికులతో పనిచేయించుకుంటుందని ఇది దుర్మార్గమైన చర్యా అని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. జనాభా పెరిగిన కార్మికులను ఎందుకు పెంచరని ప్రశ్నించారు. కార్మికుల హక్కుల సాధనకై ఐక్యంగా ఉద్యమాల ద్వారానే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల సాధనకై హనుమకొండలో జరుగు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు దశరథం. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రమణ ,ప్రసాద్, కార్మికులు బాలస్వామి కురుమయ్య గోవిందమ్మ కృష్ణ చంద్రకళతదితరులు పాల్గొన్నారు.