ములాయంను బుజ్జగిస్తున్న ఆర్జేడీ

2

హైదరాబాద్‌  సెప్టెంబర్‌4(జనంసాక్షి):

బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటైన జనతాపరివార్‌లో చీలికలు వచ్చి సమాజ్‌వాదీ పార్టీ తప్పుకున్న సంగతి తెలిసిందే. ములాయం సింగ్‌ ఆధ్వ ర్యంలోని సమాజ్‌వాదీ పార్టీ జనతా పరివార్‌ నుంచి తప్పుకుని ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించడంతో జేడీయూ, ఆర్జేడీ నేతలు కంగుతిన్నారు. ములాయంను శాంతపరచడానికి ఈరోజు ఆర్జేడీ చీఫ్‌ లాలూప్రసాద్‌, జేడీయూ నేత శరద్‌యాదవ్‌ ములాయంను కలిసి మాట్లాడారు. తిరిగి తమతో కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.భాజపాను ఎదుర్కోవడానికి జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌, ఎస్పీ, ఎన్సీపీలు కలిసి జనతాపరివార్‌గా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే గతంలోనే సీట్ల పంపకం విషయంలో తేడాలొచ్చి ఎన్సీపీ పక్కకు తప్పుకుంది. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ కూడా జనతాపరివార్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.