మూడో జాబితా ప్రకటించిన కర్ణాటక బీజేపీ

బెంగళూరు, జనంసాక్షి: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు గడువు దగ్గర పడుతుండటంతో పార్టీలు తమ అభ్యర్థులతో జాబితాను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసి బీజేపీ మరో 37 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. మొత్తం 224 స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకూ 212 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నామినేషన్ల స్వీకరణకు గడువు ఎల్లుండితో ముగియనుంది.