మృతుడి కుటుంబానికి చేయూత…

సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా…
ములుగు, గోవిందరావుపేట,సెప్టెంబర్20(జనం సాక్షి):-
మృతుడి కుటుంబానికి సాయం అందించిన ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ సహృదయాన్ని చాటుకున్నారు.ములుగు జిల్లా
గోవిందరావు పేట మండలం బాలాజీ నగర్ గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన భూక్యా బొంద్యానాయక్  అనారోగ్యంతో ఇటీవలే మరణించారు.గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న తస్లీమా  మంగళవారం వెళ్ళి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బొంద్యానాయక్ మరణం బాధాకరమని,ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను తస్లీమా ఓద్దార్చారు.సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో  50 కేజీల బియ్యం అందించి సహృదయాన్ని చాటుకున్నారు,తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్థులు ఉన్నారు.