మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన గుడిపాటి నర్సయ్య మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన గుడిపాటి నర్సయ్య 


మోత్కూర్ నవంబర్ 8 జనంసాక్షి : మోత్కూర్ మండలంలోని పొడిచేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జిట్ట ముత్తయ్య సోమవారం మరణించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజక వర్గ ఇంఛార్జి గుడిపాటి నర్సయ్య మంగళవారం మృత దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, నాయకులు వంగాల రాంమోహన్, మాజీ సర్పంచ్ లెంకలపల్లి భిక్షమయ్య, గ్రామ కాంగ్రేస్ పార్టి అధ్యక్షులు జిట్ట అంజయ్య, చిందల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.