మెడికల్ క్యాంపు సక్సెస్

నర్సాపూర్,  సెప్టెంబర్, 21, ( జనం సాక్షి ) :
బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలోని తొమ్మిదవ వార్డ్ చైతన్యపురి కాలనీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బుధవారం నిర్వహించిన మెడికల్ క్యాంప్ విజయవంతమైంది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ప్రధానమంత్రి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రధానమంత్రి మోడీ జన్మదిన సందర్భంగా సేవ పక్షం కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.