మెడ్‌ప్లస్ క్లిక్ అండ్‌ పిక్

ఆన్ లైన్ లో ఔషదాలను ఆర్డర్ చేయడానికి ప్రముఖ ఫార్మాసీ రిటైలర్ మెడ్ ఫ్లస్ క్లిక్ అండ్ పిక్ సర్వీసును ప్రారంభించింది. తొలి దశలో హైదరాబాద్ లో ఈ సేవలు ప్రారంభించినట్లు మెడ్ ఫ్లస్ మేనేజింగ్ డైరెక్టర్ మధుకర్ తెలిపారు. త్వరలోనే 12 రాష్ట్రాల్లోని 50 పట్టణాల్లో ఆన్ లైన్ ఔషద కొనుగోళ్లను అందుబాటులోకి తెస్తామన్నారు. తమవెబ్ సైట్ కు లాగాన్ అయి కొనుగోలుదార్లు కావల్సిన ఔషదాలను, ఎఫ్ఎంసిజి ఉత్పత్తులను ఎంపిక చేసుకోవచ్చన్నారు. అయితే కొనుగోలుదార్ల ఇళ్లకే ఔషదాలు తీసుకువెళ్లి ఇవ్వడాన్ని ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలు అనుమతించనందున, వినియోగదారులు తాము ఆర్డర్ చేసిన వాటిని హైదరాబాద్లో తమకు సమీపంలోని మెడ్ ఫ్లస్ స్టోర్ నుంచి ఆర్డర్ చేసిన ఆరు గంటల్లోగా పొందవచ్చన్నారు.