మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే,మున్సిపల్ చైర్మన్

గద్వాల రూరల్ ఆగష్టు 29(జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో  క్రీడారంగంలో మన దేశ ప్రతిష్టను ఉన్నత స్థాయి  శిఖరాలకు తీసుకెళ్లిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్ నివాళులు అర్పించారు…క్రీడాకారులు అందరికీ జాతీయ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు  ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే,ఛైర్మన్.
ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, అధికారులు, క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు…