మోడీ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటికి కరపత్రం పంపిణి

మోడీ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటికి కరపత్రం పంపిణి

సంగెం : అక్టోబర్ 21 (జనం సాక్షి )
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరకాల నియోజకవర్గం ఇన్చార్జి కంటెస్టెడ్ ఏమ్మెల్యె డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి సంగెం మండలం తిమ్మాపురం గ్రామంలో ఇంటింటి బిజెపి ప్రచారం చేపట్టినారు. ఈ ప్రచారంలో
వారు ఓటరు మహాసేయులకు విజ్ఞప్తి,
ఒక అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపెడతాం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినారు.
తిమ్మాపురం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులే స్మశాన వాటికలు, డంపింగ్,పళ్లే ప్రకృతి వనాలు,రైతు వేదికలు, గ్రామపంచాయతీ
14, 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామలు అబీవ్రృధ్ధి చెందుతున్నాయి. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు, లైట్ల పైసలు,సిసి రోడ్ల పైసలు, అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులే ప్రజలందరూ ఒకసారి గమనించాలని,ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి అభివృద్ధి చేసి చూపేడాతాం అని అన్నారు.ఈ కార్యక్రమంలోభారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బుట్టి కుమారస్వామి,వరంగల్ జిల్లా కార్యదర్శి మొలుగూరి శ్రీనివాస్,
మైనారిటీ మోర్చ జిల్లా అధ్యక్షులు రహమతుల్లా,మండల ప్రధాన కార్యదర్శులు కీసరీ వీరయ్య, భూక్యా వెంకన్న, మండల కార్యదర్శి అచ్చ రాజు, మండల ఉపాధ్యక్షుడు గోనె ముకుందం,కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు పోశాల కిశోర్,
తిమ్మాపురం గ్రామ బూత్ అధ్యక్షులు కాగితాల రమణాచారి,
గాంధీనగర్ భూత్ అధ్యక్షులు ననవాస రాంబాబు,
పోచమ్మ తండ బూత్ అధ్యక్షుడు బాదవాతు రాజన్, సోమ్లతండ బూత్ అధ్యక్షులు వెంకన్న, సోషల్ మీడియా కన్వీనర్ కాగితాల సాయికుమార్, యువమోర్చా మండల ప్రధాన కార్యదర్శి నంద్యాల సతీష్ ,రాజు, సురేష్, వీరచారి‌ గ్రామాల్లోని పార్టీ నాయకులు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.