యాకాంతం గౌడ్ కు రాష్ట్రస్థాయి అప్రిసియేషన్ అవార్డు

కేసముద్రం ఆగస్టు 17 జనం సాక్షి  / 2021 – 2022 సవత్సరంలో  మహబూబాబాద్ జిల్లాలో అధికంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినందుకు రాష్ట్రస్థాయిలో గవర్నర్ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ అప్రిసియేషన్ అవార్డు సర్టిఫికెట్ ను బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా మండలంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్  కరస్పాండెంట్ శ్రీ చిర్ర యాకాంతం గౌడ్ కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా
యాకాంతం గౌడ్ మాట్లాడుతూ ఈ అవార్డ్ రావడానికి సహకరించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ వారికి, మోటివేట్ చేసిన మిత్రుడు గందసిరి శ్రీనివాస్ గౌడ్ (రెడ్ క్రాస్ సొసైటీ)కి, సహకరించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు రక్త దానం చేసిన రక్తదాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు…