యువకుని దారుణ హత్య
కోహెడ : మండలంలోని సముద్రాల ఇందిరానగర్ కాలనీలో కొండని రమేశ్ (22) అనే యువకుడు దారుణ హత్యకు గురుయ్యాడు. నిన్న రాత్రి యువకుని ఇంట్లోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి అతనిపై దాడి చేసి చంపేశారు. భూతగాదాలతో తమ కొడుకును బంధువులే హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.