యూపీఎస్సీ.సిసెట్ పరీక్షలు కోసం మైనారిటీ విద్యార్థులకు ఉచిత బోధన

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్, మైనారిటీల సంక్షేమ శాఖ, హైదరాబాద్ వారు   యూపీఎస్సీ   – సి సెట్    2023 పరీక్ష కోసం 2022-2023 విద్యా సంవత్సరంలో (100) మైనారిటీస్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ను నిర్వహిస్తోంది. ఇట్టి శిక్షణకు రిజర్వేషన్ల నియమం ప్రకారం మహిళా అభ్యర్థులకు 33.33% సీట్లు మరియు అన్ని రిజర్వ్డ్ కేటగిరీలలో వికలాంగులకు 3% సీట్ల కేటాయించడం జరుగును.హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ లో మొదటిసారి ప్రవేశం పొందే అభ్యర్థులందరూ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకొనవలెను మరియు ప్రవేశం పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఉంటుంది.యుపిఎస్సి (సిఎస్ఎటి -2023) యొక్క సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో ప్రవేశం కోసం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని  సాధారణ / ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీస్ అభ్యర్థుల ద్వారా ఆన్‌లైన్ http://tmreis.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయి మరియు దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ: 07-09-2022. మరియు ప్రవేశ పరీక్షా తేదీ :18-09-2022 న అన్ని జిల్లా కేంద్రము లో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించబడునని తెలిపారు
అర్హులైన ఆసక్తి కలిగిన మైనారిటీస్ విద్యార్థులు ఇట్టి సదవకాశాన్ని సద్వినియోగ పర్చుకోగలరని .కే. సత్యనారాయణ, జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి, యాదాద్రి భువనగిరి  తెలియజేశారు