యూపీఏకు మద్దతు ఇవ్వబోం

డీఎంకే చీఫ్‌ కరుణానిధి

చెన్నై, మార్చి 25 (జనంసాక్షి) :
శ్రీలంక తమిళుల విషయంలో ద్రోహం తలపెట్టిన యూపీఏకు మద్దతివ్వబోమని డీఎంకే చీఫ్‌ కరుణానిధి స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఒక ప్రతికా ప్రకటన విడుదల చేశాయి. యూపీఏ తమిళుల ఊచకోతపై అన్యాయంగా ప్రవర్తించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తులు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. శ్రీపెరంబుదూర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు స్టాలిన్‌ ధ్రువీకరించారు. శ్రీలంక తమిళుల సమస్యపై తాము చెప్పిన సవరణలు తీసుకురావడంలో కేంద్రం విఫలమైందన్నారు. తమిళుల మనోభావాలు అర్థం చేసుకోలేని యూపీఏతో ఇక ఉండకూదని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. తమపై, తమ పార్టీ నేతలపై యూపీఏ ఎలాంటి దాడులు చేయించినా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు.