యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ప్రారంభం

ఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అనుమతి అంశంపై నెలకొన్న ప్రతిష్ఠంభనపై చర్చించేందుకు యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ఢిల్లీలో ఆరంభమైంది. యూపీఏ  అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌, ప్రపుల్‌ పటేల్‌,ఫరూక్‌ అబ్దుల్లా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.