యూపీఏ భాగస్వామ్య పక్షాలు భేటీ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యూపీఏ భాగస్వామ్య పక్షాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. ఎఫ్‌డీఐలపై నెలకోన్న ప్రతిష్టంభనపై చర్చిస్తున్నట్లు సమాచారం, ఎఫ్‌డీఐలపై చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.