యోగాతో మానసిక ఆరోగ్యం

పటాన్‌చెరు,జూన్‌21(జ‌నం సాక్షి): యోగా చేయడం ద్వారా ఇటు మానసికంగా, అటు ఆరోగ్య పరంగా ఉంటారని జ్యోతి నగర్‌ సెయింట్‌ అర్నోల్డ్‌ హైస్కూల్‌లో నిరవహించిన యోగా డే దినోత్సవం లో ముఖ్యాతిధులుగా పాల్గొన్న డా. పద్మనాభం రెడ్డి,పాఠశాల ప్రిన్సిపాల్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని సెయింట్‌ అర్నోల్డ్‌ హైస్కూల్‌లో నాల్గవ అంతర్జాతీయ యోగా వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా ఇటు మానసికంగా, అటు ఆరోగ్య పరంగా ఉంటారని, మన నిత్య జీవితంలో ఒక మంచి అలవాటు అని కావున అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవలని సూచించారు.